రస్మిక అదే పనిలో ఉంది

సుకుమార్‌ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించనున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన హీరోయిన్. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఈ సినిమాకు సంబంధించి చిత్తూరు నేప‌థ్యంలో క‌థ న‌డుస్తుంది. దీంతో పాత్ర‌కు ప్రాణం పోయాల‌నే త‌లంపుతో  చిత్తూరు యాసను పక్కాగా నేర్చుకుంటోంది రస్మిక.  కరోనా లాక్‌డౌన్ తో దొరికిన ఖాళీ సమయాన్ని ఇందుకోసమే వాడుకుంటోంది.

ఇక ఇటీవల కరోనాపై ప్రజలకి దైర్యం చెబుతూ రస్మిక ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఒక్క క్షణం కూడా మనోధైర్యాన్ని కోల్పోకండి. మనం ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నాం. విజయం సాధిస్తాం. ఇతరులకు సాయం చేయండి’ అని రస్మిక ట్విట్ చేసింది.