రక్తదానం చేసిన కేటీఆర్

తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు. పార్టీ శ్రేణులు సామాజిక దూరాన్ని పాటిస్తూ రక్తదాన కార్యక్రమాన్ని వారం రోజులపాటు కొనసాగించాలని కోరారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలందరూ తమ ఇళ్లపై పార్టీ జెండాలు ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ప్రస్తుత సంక్షోభ సమయంలో కేసీఆర్ ప్రెస్‌మీట్‌ కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకి ఆయన మీద ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనం. రాష్ట్ర విభజన సందర్భంలో లక్షలాది మంది ప్రజలు ఆయనను ద్వేషించారు. అప్పుడు ద్వేషించిన వారే ఇప్పుడు అభిమానిస్తున్నారన్నారు.  కాగా, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27న కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే.