కనికాకు నోటీసులు

కరోనాపై గెలిచిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కి కష్టాలు తప్పడం లేదు. తాజాగా ఆమెకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. లండన్ వెళ్లొచ్చిన కనికా.. ఆ విషయం దాచిపెట్టేసి లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్స్ లో జరిగిన పార్టీకి హాజరైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెకి కరోనా పాజిటివ్ గా తేలడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కరోనాపై కనికా గట్టిగానే పోరాడింది. ఆమెకి ఐదుసార్లు చేసిన కరోనా నిర్థారణ పరీక్షల్లోనూ పాజిటివ్ వచ్చింది. ఆరోసారి నెగటివ్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు.

అయితే, లండన్ వెళ్లొచ్చిన విషయం దాచి పార్టీలో పాల్గొనడంపై ఆమెపై 188, 269, 270 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తాజాగా దీనికి సంబంధించిన నోటీసులని పోలీసులు కనికాకి అందజేశారు. కనికా తరుపున స్టేట్ మెంట్ ఇవ్వాలని, అందుకు ఈ నెల 30వరకు గడువు ఇస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అయితే తాను తన తరఫున లాయర్‌ను కలిసిన తరువాత స్టేట్‌మెంట్ ఇస్తానని కనికా చెప్పినట్టు పోలీసులు తెలిపారు.