సగం పూర్తయ్యాయ్.. పుష్ప !


అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా ‘పుష్ప’ రాబోతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్. పాన్ ఇండియా సినిమాగా ‘పుష్ప’ రానుంది. కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్స్ అన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప పనులు మాత్రం కొన్ని కొనసాగుతున్నాయి.

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్ప కోసం ట్యూన్స్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే సగం ట్యూన్స్ రెడీ చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా దేవినే తెలిపాడు. వాస్తవానికి కరోనా లాక్‌డౌన్‌కి ముందే… ఓ పాట ప్రిపేర్ చేసి. రికార్డింగ్ చేసేసి.. సుక్కు అండ్ బానికి వినిపించడం వాళ్ళు హ్యాపీ ఫీలవడం జరిగిందట. ఇక అదే సాంగ్ తో షూటింగ్ మొదలెట్టాలనుకుంటే కరోనా అడ్డం పడింది. కరోనా ప్రభావం ముగిశాక.. ఈ సాంగ్ తోనే షూటింగ్ మొదలెడతారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో అదిరిపోయే అటమ్ సాంగ్ ఉండనుందట. ఈ సాంగ్ లో చిందేయడానికి బాలీవుడ్ బ్యూటీని తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఓ కీలక పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకున్నారు. కానీ, ఆయన సినిమా నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో కన్నడ హీరో ధనుంజయ్ ని తీసుకున్నారని.. లేదు బాలీవుడ్ హీరోని తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. సినిమాలో బన్నీ లవ్వర్ గా నివేదా థామస్ కనిపించబోతున్నారనే ప్రచారం కూడా ఉంది. వీటన్నింటిపై క్లారిటీ రావాల్సి ఉంది.