మహేష్ నిర్మాతగా చరణ్ సినిమా

మహేష్-రామ్ చరణ్ కాంబోలో ఓ సినిమా రాబోతుందా ? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ‘మహర్షి’ కాంబోలో మరో సినిమా రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీపైడిపల్లి దర్శకత్వంలోనే మహేష్ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా క్యాన్సిల్ అయింది. దీంతో పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు మహేశ్ రెడీ అవుతున్నారు.

మరీ.. మహేష్-వంశీ సినిమా ఏమైనట్టు ? అంటే.. అది రామ్ చరణ్ కి చేరింది. వంశీ తన కోసం రెడీ చేసిన కథని మహేష్ రామ్ చరణ్ కి సిఫార్సు చేశాడట. ఈ కథ చరణ్ కి బాగా సూటవుతుంది. ఆయన ఓకే చెబితే.. తానే నిర్మిస్తానని చెప్పారట. వంశీ కథని రామ్ చరణ్ కూడా ఓకే చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత వంశీ సినిమా చేసే ఛాన్స్ ఉంది.