చంద్రబాబు మాజీ పీఏపై ఫోర్జరీ కేసు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు మాజీ పీఏ పి మనోహర్ పై ఫోర్జరీ కేసు నమోదైంది. కుప్పం కోపరేటివ్ వ్యాంక్ లోని ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం ఫిక్సెడ్ డిపాజిట్ల నుంచి తన సంతకాలను ఫోర్జరీ చేసి రుణం తీసుకున్నాడని వైకాపా నేత విద్యాసాగర్ రావు పోలీసులకి ఫిర్యాదు చేశారు.

దీంతో మనోహర్ పై ఐపీఎస్ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేసి కేసులు బనాయించారని మనోహర్ ఆరోపించారు. దీనిపై తెదేపా, వైకాపా నేతలు మాటల యుద్ధానికి దిగుతారా ? అన్నది చూడాలి.