రియా.. లాక్ డౌన్ ఫైర్ !

కరోనా లాక్ డౌన్ తో సినీ తారలు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ ఖాళీ సమయాల్లో నచ్చిన పనులు చేసుకుంటున్నారు అయితే బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రబర్తి మాత్రం ఫైర్ అయింది. తనో జ్వాలా, రచయిత అంటూ.. కిర్రాక్ ఫోటో ఒకటి షేర్ చేసింది. దానికి అంతకంటే కిర్రాకుండే కవితని ఒకటి రాసుకొచ్చింది.

“ఇది మొత్తం. ఇది కొంచెం. ఇది విశాలంగా ఉండే మహా ప్రపంచం. నా హృదయంలో ఉండండి. దారి చూపించడం ఒక కళ. నేను వివరించాలనుకుంటున్నాను. నేను నా దారిలో నడవాలని అనుకుంటున్నాను. జ్వాలలో మండుతున్న తాజా పట్టును కొరుకోవడం సులువు. #నేను రచయిత్రినని మీకు ఇప్పుడు తెలుసు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన కాప్షన్ కన్నా.. ఆమె అందాల ఆరబోత హైలైట్ గా నిలిచింది.