బ్రేకింగ్ : రిషీ కపూర్ కన్నుమూత

బాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు రిషీ కపూర్ కన్నుమూశారు. రిషీ కపూర్ గత కొంతకాలం నుంచి క్యాన్సర్ తో  పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబరులోనే క్యాన్సర్కు చికిత్స తీసుకుని అమెరికా నుంచి భారత్ తిరిగి వచ్చారు. 

ఆ తర్వాత వైరల్ ఫీవర్, ఇన్ఫెక్షన్వంటి సమస్యలతో ఫిబ్రవరిలో రెండు సార్లు ఆస్పత్రిలో చికిత్స పొందారు.  బుధవారం రాత్రి రిషీ కపూర్ శ్వాసకోశ సంబంధిత సమస్యతో ముంబయిలోని హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు.

బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ రెండో కుమారుడు రిషీ కపూర్. 1952 సెప్టెంబరు 4న ముంబయిలో జన్మించారు. ఉత్తమ బాలనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. 1973లో తొలిసారి హీరోగా రిషీ కపూర్ బాబీ చిత్రంలో నటించారు. దాదాపు 51 చిత్రాల్లో కథానాయకుడిగా నటించి మెప్పించారు. పలు మల్టీ స్టారర్ సినిమాల్లో నటించారు. ఆర్.కె.ఫిలిమ్స్ బ్యానర్ పై పలు చిత్రాలు నిర్మించారు. రిషీ కపూర్ మరణంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.