రిషి కపూర్ చివరి కోరిక ఏంటంటే ?

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ కన్నుమూశారు. రెండేళ్ల పాటు కాన్సర్ తో పోరాడిన ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. చనిపోయే ముందు క్షణాల్లోనూ రిషీ కపూర్ సరదా మాట్లాడినట్టు డాక్టర్లు తెలిపారు. దీన్ని బట్టి ఆయన జీవితాన్ని ఆస్వాదించినట్టు అర్థమవుతోంది. అయితే ఆయన చివరి కోరిక మాత్రం తీరలేదని తెలుస్తోంది. తనయుడు రణ్ బీర్ కపూర్ -అలియా భట్ ల పెళ్లితంతుని చూడాలని రిషి కపూర్ ఆశపడ్డారు. 

అలియా-రణ్ బీర్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వారి ప్రేమ, పెళ్లికి పెద్దల అంగీకారం కూడా లభించింది. ఈ యేడాదియే పెళ్లి అనే వార్తలు వినిపించాయి. ఇంతలో కరోనా ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ తగ్గకముందే రిషి కపూర్ మృతి చెందారు. లేదంటే.. ఆయన ఆఖరి కోరిక తీరేదే. తనయుడు రణ్ బీర్ కపూర్ పెళ్లిని చూసేవారే. ఇక అభిమానులని ఉద్దేశించి రిషి కపూర్ కోరిక ఆఖరి కోరిక ఏంటో తెలుసా ? 
 
ఏప్రిల్ 2న రిషి కపూర్ తన చివరి ట్వీట్ పెట్టారు.  ఈ ట్వీట్ లో ఆయన తన అభిమానుల ఓ విజ్ఝప్తి చేశారు. ‘క‌రోనా వైర‌స్‌ ను తరిమేసేందుకు నిర్విరామంగా పోరాడుతున్న వైద్యులు, న‌ర్సులు, పోలీసుల ప‌ట్ల హింస‌ను మానుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు చేతులెత్తి విజ్ఞ‌ప్తి చేస్తున్నా. మ‌న‌కోసం వారు ప్రాణాల‌కు తెగించి పోరాడుతున్నారు. అలాంటి వారిపై దాడుల‌కు దిగవద్దు… జై హింద్” అని రిషి కపూర్ ట్విట్ చేశారు.