తెలంగాణ సాయుధ పోరాటంపై సుక్కు సినిమా

దర్శకుడు సుకుమార్ పుస్తకాల ప్రియుడు. పురుగు. ‘రంగస్థలం’ తర్వాత తెలంగాణ సాయిధ పోరాటానికి సంబంధించిన పుస్తకాన్ని చదివాడట. దీనిపై సినిమా కూడా చేయాలని భావించాను. కానీ కుదరలేదు అని చెప్పుకొచ్చాడు సుక్కు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సినీ తారలంతా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే.

ఈ ఖాళీ సమయాల్లో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. సుక్కు కూడా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా లాక్ డౌన్ కారణంగా షూటింగుకి వెళ్లకపోయినా, స్క్రిప్ట్ కి సంబంధించిన .. కాస్ట్యూమ్స్ కి సంబంధించిన పనులను పూర్తి చేశాను. మిగతా పాత్రల లుక్స్ కి సంబంధించిన విషయాల్లోను క్లారిటీకి రావడం జరిగిందని తెలిపారు. షూటింగ్ కి వెళ్లాక ఎక్కడా గ్యాప్ రాకుండా ప్లాన్ చేసుకున్నాని చెప్పుకొచ్చాడు.

అల్లుఅర్జున్-సుకుమార్ కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. వీరి కాంబోలో రాబోతున్న తొలి పాన్ ఇండియా సినిమా కూడా. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. రష్మిక మందన హీరోయిన్. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ కి చెందిన పలువురు నటీనటీలు పుష్పలో నటిస్తారని సమాచారమ్.