అందుకే మోడీని అన్ ఫాలో చేశాం : వైట్ హౌస్

భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు భారత పీఎంవో కార్యాలయం, భారత రాష్ట్రపతి భవన్, ఇండియా ఇన్‌ యూఎస్‌ఏ, యూఎస్ ఎంబసీ ఇండియా ట్విట్టర్ ఖాతాలను వైట్ హౌస్ అన్ ఫాలో చేసిన సంగతి తెలిసిందే. దీనికి గల కారణమేంటీ ? అన్నది చర్చనీయాంశంగా మారింది. రకరకాల గాసిప్ లు పుట్టుకొస్తున్నాయ్.

ఈ నేపథ్యంలో మోడీని అన్ ఫాలో చేయడంపై వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ దేశ పర్యటనకు వెళ్లాలనుకుంటే ఆ దేశ ట్విట్టర్‌ ఖాతాలను తాము ఆ సమయంలో కొన్ని రోజుల పాటు ఫాలో అవుతామని తెలిపింది. ఆయా ప్రముఖులు చేసిన ట్వీట్లను ఆ సమయంలో రీట్వీట్ చేస్తామని చెప్పింది. ఆ తర్వాత వారి ఖాతాలని అన్ ఫాలో చేస్తామని వివరణ ఇచ్చింది.