ఏపీలో మరో ఇద్దరు మృతి 

తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేష్ లో కరోనా రోజురోజూకి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,463కి చేరింది. ఇవాళ కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 33కి చేరింది.

దేశంలోనే ఎక్కువగా ఏపీలో పరీక్షలు చేస్తున్నట్టు మంత్రి బుగ్గన తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకున్నామన్నారు. రాష్ట్రంలో కోలుకొనే వారి సంఖ్య పెరిగిందనీ.. పాజిటివ్ కంటే డిశ్చార్జులు పెరిగాయని మంత్రి తెలిపారు.