దేశంలో 35వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా కొత్తగా 1993కేసులు నిర్ధారణ కావడంతోపాటు 73మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారిసంఖ్య 1147కి చేరగా మొత్తం బాధితుల సంఖ్య 35,043కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ఇక దేశంలో వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి శాతం 25.36గా ఉంది. ఇప్పటి వరకు 8889మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మరో 25,007 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు కరోనా ప్రభావం ఆధారంగా జిల్లాల వారీగా జోన్ల లిస్టుని రెడీ చేసింది కేంద్రం. రెడ్, ఆరేంజ్, గ్రీన్ జోన్లుగా విభించారు. వీటి ఆధారంగా మే 3 తర్వాత లాక్‌డౌన్ లో సడలింపులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.