మహారాష్ట్రలో 10వేలు దాటిన కరోనా కేసులు

మహారాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజూకి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా సోకిన వారిసంఖ్య 10498చేరగా 459మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర తర్వాత గుజరాత్, మధ్య ప్రదేష్, ఢిల్లీలలో కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తోంది.

గుజరాత్ లో మొత్తం కేసుల సంఖ్య 4395కి చేరగా ఇప్పటివరకు 214మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లోనూ కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 2660 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 137మంది మరణించారు. దేశ రాజధాని దిల్లోలో ఇప్పటివర 3515 మందికి కరోనా సోకగా 59మంది మరణించారు.