మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్


మే1-ప్రపంచ కార్మిక దినోత్సవం. ఈ సందర్భంగా కార్మికులకి గవర్నర్‌ తమిళిసై సౌదర రాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘జాతి నిర్మాణంలో, నాగరికత వికాసంలో కార్మికుల చెమట, రక్తం ఉన్నాయి. యావత్‌ సమాజం కార్మికవర్గానికి అండగా నిలవాల్సిన తరుణమిది’ అన్నారు సీఎం కేసీఆర్.  కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.

‘దేశనిర్మాణంలో కార్మికుల శ్రమను గుర్తించిన రోజు మేడే. శ్రామికుల కష్టాన్ని గుర్తించి గౌరవిద్దాం. కార్మికులంతా ఆరోగ్యం, సంపదతో బాగుండాలని ప్రార్థిస్తున్నా. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు పాటించి కరోనాపై విజయం సాధించాలి’ అని గవర్నర్‌ పిలుపునిచ్చారు. ‘కరోనా కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటున్న కార్మికులకు వందనం, వారందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు’ అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు.