సినీ కార్మికులకి రఘుబాబు విరాళం

కరోనా లాక్‌డౌన్ వేళ సినీ కార్మికులని ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సిసిసి సంస్థ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ సంస్థకి స్టార్ హీరోల నుంచి చిన్నా చితకా నటీనటులు విరాళం అందించారు. ఆ డబ్బుతో సినీ కార్మికుల కోసం నిత్యవసర సరుకులు కొనుగోలు చేసి.. వారికి అందించారు. 

తాజాగా సిసిసి కోసం నటుడు రఘుబాబు లక్షరూపాయల విరాళం అందించారు. అలాగే ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్ కి 25 వేలు, టీవీ ఆర్టిస్ట్ యూనియన్ కి 25 వేలు, కాదంబరి కిరణ్ మనం సైతం కి 25 వేలు, మొత్తం ఒక లక్షా 75 వేల రూపాయలను విరాళంగా రఘుబాబు ఇవ్వడం జరిగింది.