కిషన్ రెడ్డికి కరోనా ?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలో కరోనా కలవరం మొదలైంది. ఇటీవల ఆయన్ని రెండు సార్లు ఇంటర్వ్యూ వేసిన తెలుగు టీవీ ఛానెల్ రిపోర్టర్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కిషన్ రెడ్డి అప్రమత్తం అయ్యారు. హోం క్వారంటైన్ కి వెళ్లినటు తెలుస్తోంది. 

ఇక కరోనా పాజిటివ్ గా తేలిన తెలుగు టీవీఛానెల్ ఢిల్లీ విలేకరిని ఆసుపత్రికి తరలించారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరిక్షలు నిర్వహించారు. ఆ విలేకరి ఎవరెవరిని కలిశారన్న కోణంలో సమాచారం సేకరణ చేస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హోం క్వారంటైన్ లోకి వెళ్లారనే వార్త బీజేపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనిపై కిషన్ రెడ్డి నుంచి ఓ ప్రకటన వస్తే క్లారిటీ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.