పవన్-నాని-చైతూ-త్రివిక్రమ్ కాంబోలో సినిమా

టాలీవుడ్ లో సరికొత్త కాంబినేషన్ సెట్ అయినట్టు సమాచారమ్. పవన్ కల్యాణ్-నాని-నాగ చైతన్య-త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రాబోతుందని తెలుస్తోంది. అలాగని ఇది మల్టీస్టారర్ సినిమా కాదు. సింగిల్ స్టార్ సినిమానే. ‘సంతోషం’ దర్శకుడు దశరత్ నాగ చైతన్యతో ఓ సినిమా తెరకెక్కించనున్నారు.

ఈ చిత్రాన్ని పవన్-నాని-త్రివిక్రమ్ కలిసి నిర్మిస్తారని తెలిసింది. నాని, పవన్ లకి ప్రత్యేక బ్యానర్లు ఉన్నాయి. త్రివిక్రమ్ ఆస్థాన బ్యానర్ హారిక & హాసినీ ఇందులో భాగస్వామ్యం కానుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ చిత్రంలో పవన్, నాని గెస్ట్ రోల్ లో మెరిసే ఛాన్స్ ఉందని కూడా చెబుతున్నారు.

ప్రస్తుతం పవన్ ‘వకీల్ సాబ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. నాని ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ లవ్ స్టోరీ తెరకెక్కుతోంది. సాయి పల్లవి కథానాయిక. త్రివిక్రమ్ మాత్రం తన తదుపరి సినిమా ఎన్ టీఆర్ తో చేసేందుకు రెడీ అవుతున్నారు.