గుడ్ న్యూస్ : సెలూన్స్ తెరచుకోనున్నాయ్

కరోనా ఎఫెక్ట్ తో గడ్డాలు, మీసాలు పెరిగిపోయాయ్. ఎవరిని చూసిన జుట్టు పెంచుకొని.. ఓ చిన్నపాటి దేవదాసులా కనిపిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తో క్షౌరశాలలు, సెలూన్స్ బంద్ అయ్యాయ్. అయితే ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్న మూడో విడత లాక్ డౌన్ లో దేశవ్యాప్తంగా రెడ్ జోన్లు మినహా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో క్షౌరశాలలు, సెలూన్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

వీటితో  పాటు ఈ- కామర్స్ సంస్థల ద్వారా అన్ని రకాల వస్తువుల విక్రయాలకు పచ్చజెండా ఊపింది. ఇక ఇప్పటికే ఆరేంజ్, గ్రీన్ జోన్లలో షరతులతో  కూడిన మద్యం అమ్మకాలకి కేంద్రం అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 4 నుంచి సెలూన్స్, మద్యం షాపులు తెరచుకోనున్నాయ్. అయితే తెలంగాణలో మే 7 నుంచి ఇవి తెరచుకొనే అవకాశం ఉంది.