కాల్వలో ఈత కొట్టిన తెరాస ఎంపీ, ఎమ్మెల్యే

గోదావరి జలాలు తెలంగాణలో పరుగులు తీస్తున్నాయి. రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కుడి, ఎడమ కాల్వలకు మంత్రి హరీశ్‌ రావు శనివారం నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆనంద సమయాన ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాల్వలో కాసేపు ఈత కొట్టారు.

హరీశ్‌ రావు సైతం ఆనందంతో కాల్వ నీటిని ఇతరులపై చల్లుతూ ఆనందపరవశుడయ్యారు.‌ మంత్రి హారీష్ రావు, ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు కాల్వలో సరదాగా ఈతకొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.