తెలంగాణలో కరోనా తగ్గుముఖం. కానీ.. !

తెలంగాణలో కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. రోజురోజూకి కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం కరోనా విజృంభిస్తోంది. ఇటీవల నమోదవుతున్న కేసులన్నీ గ్రేటర్ లోనే నమోదవుతున్నాయి. శనివారం తెలంగాణలో మొత్తం 17కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 15 కేసులు గ్రేటర్ హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. శనివారం కరోనాతో ఒకరు మృతి చెందారు.

ఇప్పటి వరకు తెలంగాణలో 1061 కరోనా కేసులు నమోదయ్యాయి. 29 మంది మృతి చెందారు. ఇక కేంద్ర ప్రకటించిన రెడ్ జోన్లలో హైదరాబాద్‌తోపాటు వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. మే 17 వరకు లాక్‌డౌన్ ని పొడగించిన కేంద్రం.. ఆరేంజ్, గ్రీన్ జోన్లకి సంబంధించి కొన్ని సడలింపులు ఇచ్చింది. ఈ సడలింపులని తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేస్తుందా  ? లేదా … ? ఎప్పటిలాగే తెలంగాణలో ఎలాంటి సడలింపులు ఉండవ్ అని చెబుతుందా ?? అన్నది తెలియాల్సి ఉంది.