కాజల్’పై క్లారిటీ ఇచ్చిన ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి సమస్య ఎదుర్కోలేదు. ఆయన సినిమాల్లో ఛాన్స్ దొరకడమే అదృష్టంగా భావించేవారు హీరోయిన్స్. చిరు సినిమా ఆఫర్ అనగానే మిగితా సినిమాలు వదిలేసి.. మరీ వచ్చేసేవారు. కానీ ఇప్పుడు చిరు సినిమాని హీరోయిన్స్ లైట్ గా తీసుకోవడం ఆశ్చార్యాన్ని కలిగిస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హీరోయిన్ గా త్రిషని తీసుకున్నారు. ఆమె సడెన్ గా సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చింది. క్రియేటివ్ డిఫరెన్స్ వలనే చిరు సినిమాని వదులుకున్నట్టు త్రిష ట్విట్ చేసింది.

ఆ తర్వాత అది నిజం కాదు. ఆమెతో చిత్రబృందంతో ఎలాంటి సమస్య లేదు. మణిరత్నం సినిమా ఆఫర్ రావడంతో త్రిష నా సినిమా నుంచి తప్పుకుందని చిరు స్పష్టతనిచ్చారు. ఇక త్రిష స్థానంలో కాజల్ ని తీసుకున్నారు. ఇప్పుడు కాజల్ కూడా ఆచార్య నుంచి తప్పుకుందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై ఆచార్య చిత్రబృందం స్పందించింది.

‘ఆచార్య సినిమా నుంచి కాజల్ తప్పుకుంది అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ రూమర్స్. లాక్ డౌన్ తరువాత పరిస్థులని బట్టి సినిమా షెడ్యూల్ వుంటుంది. ఆ షెడ్యూల్ లో కాజల్ పాల్గొననుంది’ అని ఆచార్య చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ఇక వేసవిలో రిలీజ్ కావాల్సిన ఆచార్య కరోనా ఎఫెక్ట్ తో దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పుకొంటున్నారు.