ముంబై చేరుకున్న రిషి కపూర్ కుమార్తె

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీ కపూర్ గురువారం (ఏప్రిల్ 30) కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే తండ్రి ఆఖరి చూపుకు నోచులేకపోయింది ఆయన కూతురు రిద్దీ కపూర్. ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న రిద్దీ కపూర్ కరోనా లాక్‌డౌన్ కారణంగా తండ్రి అంత్యక్రియలకి హాజరుకాలేకపోయింది.

తాజాగా రిద్దీ కపూర్ ముంబై చేరుకున్నారు. రోడ్డు మార్గం ద్వారా 1400కి. మీ ప్రయాణించి ఆమె ముంబై చేరుకున్నారు. వచ్చిరాగానే.. తల్లిని గట్టిగా హత్తుకొని కన్నీటి పర్యంతమైంది. రిషీని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాననే బాధతో వెక్కి వెక్కి ఏడ్చింది. తండ్రి అంత్యక్రియలకి హాజరుకానీ రిద్దీ కపూర్.. అలియా లైవ్ వీడియో ద్వారా వీక్షించింది. తండ్రికి లవ్ యూ అని చెప్పి తుది వీడ్కోలు పలికింది.