అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాలి : జగదీశ్వర్ రెడ్డి

లాక్‌డౌన్‌ను రోజువారీ జీవితంలోనూ అలవర్చుకోవాలన్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. కరోనా వైరస్‌ నిరోధానికి ఉపయోగించే మూడువేల లీటర్ల శానిటైజర్‌తో పాటు మూడువేల మాస్క్‌లను ఖమ్మం ఎంపీ నామానాగేశ్వరరావు సోమవారం జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డికి అందించారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈసందర్భంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..  శానిటైజర్ల వినియోగంతో పాటు విధింగా మాస్క్‌లు ధరించాని సూచించారు. విపత్తు సమయంలో దాతృత్వం ధైర్యాన్నిఇస్తుందన్నారు. అటువంటి దాతృత్వాన్ని చాటుకున్న నేత నామానాగేశ్వర రావని కొనియాడారు. కరోనా వ్యాక్సిన్‌ వచ్చేవరకూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.