‘మహాభారతం’ పనులు మొదలుపెట్టాలి : రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం. ఈ విషయాన్ని జక్కన్న పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. మరీ.. మహాభారతాన్ని ఎప్పుడు తీస్తారు అంటే.. ? అది ఇప్పుడే చెప్పలేను. అసలు చేస్తానో.. లేదో..  ? కూడా తెలీదు అనేవారు. తాజాగా ఓ దినపత్రికతో మాట్లాడిన జక్కన్న మహాభారతంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.

“మహాభారతం పనులు మొదలుపెట్టాలి. దానికి కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి ఇప్పటికిప్పుడు దానిమీద కూర్చుని పని చేద్దామనే ప్రాజెక్ట్ కాదది. చాలా శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలి. పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టాలి. అప్పుడు కానీ దాన్ని మొదలు పెట్టలేం” అన్నారు రాజమౌళి.

ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. స్వాతంత్య్ర సమర యోధులు కొమరంభీమ్, అల్లూరిసీతారామరాజుల మధ్యగల కామన్ పాయింట్ తో ఈ కథని రెడీ చేశారు రాజమౌళి. ఇందులో కొమరం భీమ్ గా తారక్, ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. అల్లూరిగా రామ్ చరణ్, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తున్నారు. దాదాపు రూ. 400కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.