జర్నలిస్టులకి కిషన్ రెడ్డి సాయం

తెలుగు జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సహాయం చేశారు. ఢిల్లీలో ఉన్న తెలుగు జర్నలిస్టులకి కిషన్‌రెడ్డి కరోనా టెస్టులు చేయించారు. అపోలో హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి జర్నలిస్టులకు టెస్టులు చేయించారు. ఇప్పటికే 35 మంది జర్నలిస్టులకు టెస్టులు చేశారు. మిగిలిన వారికి కూడా ఇవాళ, రేపు చేస్తారు. అంతేకాదు.. జర్నలిస్టుల ఆరోగ్య పరిస్థితిని కిషన్ రెడ్డి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు.

మరోవైపు కిషన్ రెడ్డి హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలుగు టీవీ ఛానెల్ రిపోర్ట్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. సదరు జర్నలిస్ట్ ఇటీవల రెండు సార్లు కిషన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కిషన్ రెడ్డి హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారనే వార్తలు వినిపించాయి. బహుశా.. అందుకేనేమో.. కిషన్ రెడ్డి ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులకి కరోనా టెస్టులు చేస్తున్నారు.