50వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభిస్తోంది.గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,561 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 89మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య గురువారం నాటికి 52,952కు చేరగా 1,783 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

మొత్తం బాధితుల్లో 15,267మంది కోలుకుని డిశ్ఛార్జి అయ్యారు. మరో 35,902 మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో 16వేల కేసులు, 651 మరణాలు నమోదయ్యాయ్. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 1,233 కొత్త కేసులు, 34మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,758కి చేరగా 651 మంది మృత్యువాతపడ్డారు. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీలో 1777, తెలంగాణలో 1107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.