విశాఖ ఘటన.. గుండె పగిలినంత పనైంది

విశాఖ గ్యాస్ లీక్ ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13మంది మృతిచెందగా.. దాదాపు 300 మందికిపైగా తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఈ ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్ టీఆర్ విశాఖ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘వైజాగ్ గ్యాస్ లీక్ వార్త తనను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ కష్టకాలంలో వైజాగ్ నగర ప్రజలు మరింద దృఢంగా నిలవాల్సిన అవసరం ఉంది’అని తారక్ ట్విట్ చేశారు. 

అంతకుముందు రామ్ చరణ్ విశాఖ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైజాగ్ లో దృశ్యాలు చూస్తుంటే గుండె పగిలినంత పనైంది. బాధితులు త్వరగా కోలుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’నని చరణ్ ట్విట్ చేశారు. మెగస్టార్ చిరంజీవి, రవితేజ, తమన్నా.. తదితరులు విశాఖ ఘటనపై స్పందించారు.