2022లో ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా

బాహుబలి ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ రాథాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు. పూజా హెగ్డే హీరోయిన్. ఇదో ప్రేమకథా చిత్రమ్. యూరప్ నేపథ్యంలో పునర్జన్మల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఉండనుంది.

ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడు ? సినిమా పూర్తి కావడానికి ఎంత టైం పడుతుంది ? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు ?? అనే విషయాలపై నిర్మాత అశ్వినీదత్ క్లారిటీ ఇచ్చారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ విడుదలై 30యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్వినీదత్ ప్రభాస్ సినిమా ముచ్చట్లు చెప్పారు.

మహానటి తర్వాత నాగ్ అశ్విన్ ఎలాంటి కథని రెడీ చేస్తారనే ఆసక్తి మాలో ఉండేది. అయితే ఓ అద్భుతమైన కథని రెడీ చేశారు. దాన్ని తెరకెక్కించేందుకు వందల కోట్లు ఖర్చు అవుతోంది. ఈ కథకి ప్రభాస్ అయితేనే కరెక్ట్. ఆయనతో అయితేనే మార్కెట్ కూడా వర్కవుట్ అవుతుందన్నారు. ప్రభాస్ కి కథ చెబితే… ఆయన ఒప్పుకున్నారని చెప్పారు. ఈ యేడాది అక్టోబర్ లో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అవుతోంది. 2020 ఏప్రిల్ లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని అశ్వినీదత్ తెలిపారు.