తెలంగాణలో 33 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్టే వచ్చి.. మళ్లీ విజృంభిస్తోంది. శనివారం 31 కేసులు నమోదు కాగా, తాజాగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 26 జీహెచ్ ఎంసీ పరిధిలోనివి కాగా, ఏడుగురు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు. రాష్ట్రంలో మొత్తం 1196కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 751 మంది డిశ్చార్జవ్వగా.. 30 మంది మృతి చెందారు. 415 మంది చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, నల్గొండ, కుమరంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్ అర్బన్, నిర్మల్ జిల్లాల్లో గత 14 రోజులుగా ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలంగాణ వైద్యారోగ్య శాఖ తెలిపింది.