యాదాద్రి జిల్లాని తాకిన కరోనా

గ్రీన్ జోన్ గా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాను కరోనా తాకింది. తాజాగా యాదాద్రి జిల్లాలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నెల 6న ముంబై నుంచి ఆత్మకూరు (ఎం) మండలం పల్లెర్లకి వచ్చిన ముగ్గురికి, నారాయణపురం మండలం జనగాంలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తయ్యారు.

కొద్దిరోజులుగా తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టినట్టే కనిపించింది. గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రమే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గ్రీన్ జోన్ గా ఉన్న యాదాద్రి భువనగిరిలో జిల్లాకి కరోనా తాకడం ఆందోళన కలిగిస్తోంది. రెడ్, ఆరేంజ్ జోన్లు గ్రీన్లుగా మారతాయని భావిస్తున్న తరుణంలో.. గ్రీన్ జోన్ గా ఉన్న యాదాద్రిజిల్లాకి కరోనా పాకడం షాక్ కి గురిచేస్తోంది.