రోహిత్.. రిటైర్మెంట్ ప్రకటన !

టీమిండియా ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై ప్రకటన చేశారు. కరోనా లాక్‌డౌన్‌ ఆటగాళ్లు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ ఖాళీ సమయాల్లో ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా వినోదాన్ని పంచుతున్నారు. పలు వీడియోలు, ఫోటోలను తమ అభిమమానులతో పంచుకుంటున్నారు.

అంతేకాకుండా సహచర ఆటగాళ్లతో లైవ్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌తో రోహిత్‌ ఇన్‌స్టా లైవ్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రిటైర్మెంట్ పై రోహిత్ స్పందించారు.

“నేను మరో ఐదారేళ్లలో రిటైర్మెంట్‌ తీసుకుంటాను. ప్రతీ ఒక్కరి జీవితంలో కుటుంబంతో ఎంతో ప్రధానం. విదేశీ పర్యటనలతో ప్రతీ ఒక్క ఆటగాడు తమ కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. నేను కూడా అనేక సందర్భంలో కుటుంబాన్ని మిస్సవుతున్నానే ఫీలింగ్‌ కలిగేది. ప్రస్తుతం నా వయస్సు 34. మరో ఐదారేళ్లు అంటే నా వయసు 38 లేక 39 ఏళ్ల వయసు వచ్చే వరుకు క్రికెట్‌ ఆడతాను. 2025 లేక 2026లో ఆటకు గుడ్‌ బై చెబుతా”నని చెప్పుకొచ్చాడు.