రైళ్ల ప్రారంభం.. నిబంధనలు విడుదల చేసిన కేంద్రం 

పాసింజర్ రైళ్లకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 15 పాసింజర్ రైల్స్ కూతపెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో
తాజాగా కేంద్ర హోం శాఖ ప్రామాణిక నిబంధనలను విడుదల చేసింది.

* రైలు షెడ్యూల్, ప్రయాణికుల బుకింగ్, ప్రవేశం, ప్రయాణికుల కదలికలు, కోచ్ సేవల వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖే విస్తృతంగా ప్రచారం చేయాలి.

* ధ్రువీకరించిన ఈ-టిక్కెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే స్టేషన్ లోకి అనుమతించాలి.

* ఈ-టికెట్ ఆధారంగానే ప్రయాణీకుల కదలికలతో పాటు రైల్వే స్టేషన్ కు ప్రయాణీకులను రవాణా చేసే వాహనం యొక్క డ్రైవర్ కు అనుమతి.

* రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించే ప్రయాణీకులందరికి తప్పనిసరిగా స్క్రీనింగ్ జరపాలి.

* కరోనా లక్షణాలు లేని ప్రయాణీకులను మాత్రమే రైలు ప్రయాణానికి అనుమతించాలి.

* ప్రయాణికుల కోసం స్టేషన్, కోచ్ ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద హ్యాండ్ శానిటైజర్లు పెట్టాలి.

* ప్రయాణీకులందరూ ప్రవేశ సమయంలో, ప్రయాణ సమయంలో ఫేస్ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి. 

* బోర్డింగ్, ప్రయాణ సమయంలో ప్రయాణీకులందరూ సామాజిక దూరాన్ని పాటించాలి.

* ప్రయాణీకుల కోసం ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్రచారం ద్వారా ఆరోగ్య సలహాలు, మార్గదర్శకాలు అందించాలి.

* ప్రయాణికులు వారి గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత..  ఆ రాష్ట్రం సూచించిన ఆరోగ్య నియమాలకు కట్టుబడి ఉండాల్సిందే.