ఇర్పాన్ రీ ఎంట్రీకి రెడీ


టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ రీ ఎంట్రీకి రెడీ అంటున్నాడు. ఏడాది సమయమిచ్చి సెలెక్టర్లు టీమ్‌ఇండియాలోకి ఎంపిక చేస్తామంటే, మళ్లీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తాజాగా సురేశ్‌ రైనాతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో మాట్లాడిన పఠాన్‌ మనసులోని మాటను పంచుకున్నాడు.

”ఇర్ఫాన్‌ నువ్వు రిటైరయ్యావు కానీ.. ఏడాదిలో సన్నద్ధమైతే మళ్లీ టీమ్‌ఇండియాకు ఎంపిక చేస్తాం’ అని చెబితే, అప్పుడన్నీ వదిలేసి ఆటమీదే దృష్టిసారిస్తా. మనస్ఫూర్తిగా దానిమీదే ధ్యాసపెట్టి, తీవ్రంగా కష్టపడతా. కానీ, అలా మాట్లాడేదెవరు?” అని రైనాతో అన్నాడు.

ఇర్ఫాన్‌ 2003లో 19 ఏళ్ల వయసులో టీమ్‌ఇండియాకు ఎంపికై ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఆడాడు. తర్వాత పాకిస్థాన్‌పై టెస్టుల్లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసి ప్రత్యేక గుర్తింపు పొందాడు. మొత్తంగా 29 టెస్టులాడిన మాజీ పేసర్‌ 100 వికెట్లు తీశాడు. అలాగే 120 వన్డేల్లో 173 వికెట్లు పడగొట్టాడు. 2012లో చివరిసారి టీమ్‌ఇండియాకు ఆడిన ఇర్ఫాన్‌ తర్వాత జమ్మూ కశ్మీర్‌ తరఫున దేశవాళీ క్రికెట్‌లో కొనసాగాడు.