తెరపైకి ‘గబ్బర్ సింగ్’ గొడవ ! 

హారీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. బండ్ల గణేష్ నిర్మాత. 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. అంతకుమించి పవర్ అభిమానులకి విందు భోజనం పెట్టింది. పవర్ స్టార్ స్టామినా ఏంటో నిరూపించింది. పవన్ నుంచి ఆయన అభిమానులు ఏం కోరుకుంటారో.. అవన్నీ గబ్బర్ సింగ్ లో చూపించారు దర్శకుడు హరీష్. ప్రతి ఫ్రేము.. ఓ ఆణిముత్యమే.

సోమవారంతో ‘గబ్బర్ సింగ్’ విడుదలై 8యేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ చేసిన రచ్చ మాములుగా లేదు. ట్విట్ల వర్షం కురిపించారు. పవన్ పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. పవన్ జపం చేశారు. అయితే.. దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ శృతిహాసన్ లని బండ్ల పట్టించుకోలేదు. దర్శకుడు హరీష్ శంకర్ కూడా అంతే. ఆయన ట్విట్టర్ లో విడుదల చేసిన లెటర్ లోనూ బండ్ల పేరుని ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో.. బండ్ల-హరీష్ ల మధ్య పాత గొడవలేమైనా ఉన్నాయా ? అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి.