అనారోగ్యంపై కేటీఆర్ వివరణ

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ సుస్తుగా ఉన్నట్టు కనిపించారు. జలుబు చేసినట్టు అనిపించింది. ఇది గమనించిన ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా.. ఆరోగ్యం జాగ్రత్త అంటూ ట్విట్ చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన ఆరోగ్యంపై ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు.

“నిన్నటి నుంచి తన ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదు. తాను బాగానే ఉన్నా.  సిరిసిల్లలో సోమవారం నాటి పర్యటన సందర్భంగా తనకు అనేక సంవత్సరాలుగా ఉన్న జలుబుకు సంబంధించిన ఎలర్జీ వచ్చింది.  అప్పటికే పర్యటనకు సంబంధించిన పలు కార్యక్రమాలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో.. ఎవరికీ ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని కొనసాగించాల్సి వచ్చింది”అని రాసుకొచ్చారు.