అఖిల్ 4 కూడా దొబ్బిందా ?

అఖిల్ అక్కినేని.. టాలీవుడ్ కి మరో సూపర్ స్టార్ అవుతాడని అనుకున్నారు. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు అఖిల్ పై ఆ రేంజ్ లో అంచనాలుండేవి. కానీ ఆ అంచనాలని అఖిల్ అందుకోలేకపోయాడు. అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’ అట్టర్ ప్లాప్ అయింది. ‘హలో’ యావరేజ్ అనిపించుకున్నా.. అఖిల్ పైకి లేపలేదు. ‘మిస్టర్ మజ్ణ్ను’ అంతే.

ఈ నేపథ్యంలో అఖిల్ ఆశలన్నీ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్’పైనే పెట్టుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. కరోనా ఫీవర్ లేకుంటే ఇదివరకే రిలీజయ్యేది. అయితే ఈ సినిమాని ఇటీవలే నాగార్జున చూసేశారు. ఫైనల్ అవుట్ పుట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అఖిల్ 4 కూడా దొబ్బింది అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా ఉత్తిత్తి ప్రచారమేనని చిత్రబృందం తెలిపింది.

అసలు ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఎడిటింగ్ పనులు మొదలవ్వలేదట. అలాగే కింగ్ నాగార్జున కూడా ఈ సినిమా చూడలేదట. చూడకుండానే అసంతృప్తి వ్యక్తం చేయడం ఏమిటీ ? అని చిత్రబృందం నవ్వుకుంటున్నారట. అయితే ఇలాంటి ప్రచారంతో సినిమాకి డ్యామేజ్ జరుగుతుందని లోలోన బాధపడుతున్నారు. అసలు ఇలాంటి ప్రచారం ఎలా పుట్టింది ? ఎవరు.. ఎందుకు ? చేస్తున్నారనే విషయం మాత్రం అర్థంకావడం లేదట.