కరోనా కాటు.. మరో 122మంది మృతి !

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు సడలించడం, భారీ సంఖ్యలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు తరలివెళ్తుండడంతో ఆయా రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత పెరుగుతోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3525 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 122 మరణాలు సంభవించాయి.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 74,281కి చేరగా 2415 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 24,386 మంది కోలుకోగా మరో 47,480 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మహారాష్ట్రలో వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో కేసుల సంఖ్య 24,427కు చేరగా 921 మంది మృత్యువాతపడ్డారు. కేవలం ఒక్క ముంబయి నగరంలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 15వేలు దాటింది.