కరోనా కలిపింది.. ఇద్దరినీ !


కరోనా లాక్‌డౌన్ తో సినీతారలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాత్రం తన ఫాంహౌస్‌లో వాలిపోయాడు. ఆయనకి తోడుగా ఉండటానికి హీరోయిన్ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ ఫాంహౌస్‌ కి వెళ్లింది. వీరిద్దరు ఫాంహౌస్‌లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫాంహౌస్‌ లో ప్రేమాయణం నడుపుతున్నారు. ఇప్పటికే ‘ప్యార్‌ కరోనా..’ గీతాన్ని విడుదల చేసిన సల్మాన్ తాజాగా ‘తేరే బినా..’ అనే రొమాంటిక్‌ గీతాన్ని యూట్యూబ్‌లో షేర్‌ చేశారు.

ఇందులో సల్మాన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ జంటగా నటించారు. ‘ఈ పాటను పాడింది, రూపొందించింది, షూట్‌ చేసింది నేనే. మీ కోసం పోస్ట్‌ చేశా. మీరూ వినండి, చూడండి. మీ వెర్షన్‌లో షూట్‌ చేసి, నాకు ట్యాగ్‌ చేయండి..’ అని సల్మాన్‌ ఈ సందర్భంగా పోస్ట్‌ చేశారు. సల్మాన్‌, జాక్వెలిన్‌ ప్రేమ ప్రయాణాన్ని ఇందులో చూపించారు. వీరి ప్రేమయాణం ఫాంహౌస్ కే పరిమితం అవుతుందా ? లేక.. ఆ తర్వాత కూడా కరోనా కలిపింది ఇద్దరినీ అంటూ.. నిజజీవితంలోనూ ఒక్కటవుతారా ? అన్నది చూడాలి.