ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చిన విజయ్ మాల్యా

ఆర్థిక నేరగాడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చేశాడు. భారత్‌లో వివిధ బ్యాంకుల్లో రూ.9000 కోట్ల రుణాలు ఎగొట్టి.. లండన్ చెక్కేశాడు విజయ్ మాల్యా. మన న్యాయ వ్యవస్థలోని లొసుగులని ఆసరాగా చేసుకొని తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. కానీ కుదరలేదు. ఆయన్ను తిరిగి రప్పించడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో మాల్యా కాళ్ల భేరానికి వచ్చేశాడు. నేను తీసుకున్న అప్పులని వందశాతం చెల్లిస్తా. నాపై ఉన్న కేసులు కొట్టేయాలని కోరుతున్నాడు.

“కొవిడ్ 19 రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రానికి నా అభినందనలు. వారు కావాలంటే ఎన్ని నోట్లు అయినా ముద్రించగలరు. కానీ ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 100 శాతం రుణ బకాయిలు చెల్లిస్తానన్న నా అభ్యర్థనను ప్రతిసారి విస్మరించాలా? నా డబ్బు తీసుకొని నా మీద ఉన్న కేసు కొట్టేయండి” అని మాల్యా ట్వీట్ చేశారు.