ఓటీటీలో రిలీజ్ కాబోతున్న మరో తెలుసు సినిమా

కరోనా లాక్‌డౌన్ తో థియేటర్స్ మూతపడ్డాయి. షూటింగ్స్ లేవ్. దేశంలో కరోనా ఎప్పటికి కంట్రోల్ కి వస్తుంది. థియేటర్స్ తిరిగి ఎప్పుడు తెరచుకుంటాయ్ అన్నది సమాధానం లేని ప్రశ్నంగా తయారైంది. ఇక లాక్‌డౌన్ తో ఇళ్లకే పరిమితమైన ప్రేక్షకులు డిజిటల్ ఫార్మెట్ కి బాగా అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో దర్శక-నిర్మాతలు ఓటీటీలో సినిమాల రిలీజ్ కి రెడీ అవుతున్నారు.

తెలుగులో ఇప్పటికే ‘అమృతరామమ్’ సినిమా నేరుగా ఓటీటీలో విడుద‌లైంది. ఇప్పుడు మరో తెలుగు సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘పెంగ్విన్’. తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది. ‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు.  సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. ఈ  చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 19న‌ విడుద‌ల చేస్తున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

ఇక బాలీవుడ్ చిత్రాలు గులాబో సితాబో, శ‌కుంతల దేవి కూడా ఓటీటీలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగులో రిలీజ్ కి రెడీగా ఉన్న ‘వి’, రెడ్, నిశబ్ధం సినిమాలు కూడా ఓటీటీ రిలీజ్ కోసం చర్చలు సాగుతున్నట్టు సమాచారమ్.