మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక !

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం అర్థరాత్రి అస్వస్థతకి గురయ్యారు. అర్థరాత్రి 12గంటల సమయంలో ఆమెకి ఛాతిలో నొప్పిరావడంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే మంత్రి సబితా రెడ్డి అస్వస్థతకి గురయ్యారనే న్యూస్ తెలిసి.. తెరాస శ్రేణులు ఆందోళనకి గురవుతున్నారు.

ఇక కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సబితా హోంశాఖ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆమె 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ముందు తెరాసలో చేరారు. ఆమెని సీఎం కేసీఆర్ మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. విద్యాశాఖని అప్పగించారు.