TSలో 41 కరోనా కొత్త కేసులు

తెలంగాణలో కరోనా కంట్రోల్ కి వచ్చినట్టే అనిపించి.. మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ ఎంసీ పరిధి నుంచి 26 కేసులు వచ్చాయి. మేడ్చల్ జిల్లా నుంచి మరో మూడు నమోదు అవ్వగా… 12 మంది వలస కార్మికులకు కరోనా సోకిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,592కి చేరింది. ఇప్పటి వరకు 34 మంది రాష్ట్రంలో మరణించారు. ఇవాళ మరో 10 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 556 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ పొడగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో కంటోన్మెంట్లు తప్ప అన్నీ గ్రీన్ జోన్లేనని తెలిపారు. లాక్‌డౌన్ 4కి సంబంధించిన గైడ్ లైన్స్ ని వివరించారు.