కరోనా కొత్త కేసులు.. రికార్డు !

దేశంలో కరోనా రోజురోజూకి విజృంభిస్తోంది. ప్రతిరోజూ 5వేలకిపైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 5242పాజిటివ్‌ కేసులు, 157మరణాలు నమోదయ్యాయి. ఒకేరోజు ఈ స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.

సోమవారం నాటికి దేశంలో మొత్తం పాజటివ్‌ కేసుల సంఖ్య 96,169కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 3029 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 36,824 మంది కోలుకోగా మరో 56,316 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ ని ఈ నెలాఖరు వరకు పొడగించారు. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ని కేంద్రం ఆదివారం విడుదల చేసింది.