హీరో తల్లికి కరోనా పాజిటివ్

మహమ్మారి కరోనా వైరస్ కి సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడానే లేదు. తాజాగా ఇద్దరు బాలీవుడ్  నటుల కుటుంబాలని కరోనా వణికిస్తోంది. నటుడు నవాజుద్దీన్ ఫ్యామిలీ కరోనా కలవరంతో హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ నటుడు సత్యజిత్ దూబే తల్లికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమెను నానావతి ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా ఆ కుటుంబాన్ని మొత్తం హోంక్వారంటైన్‌లో పెట్టారు అధికారులు. ‘అమ్మకి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో నేను, నా సోదరి హోం క్వారంటైన్‌లో ఉన్నాం. ప్రస్తుతానికి మా ఇద్దరికీ కరోనా లక్షణాలు లేవు. ఇక, ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న అమ్మతో రోజూ టచ్‌లో ఉన్నాం. కుదిరితే వీడియో కాల్ లేకపోతే ఫోన్ చేస్తున్నామని.. అమ్మ త్వరలోనే కోలుకుంటుందని భావిస్తున్నా. ఇలాంటి పరిణామం ఊహించలేదు’ అని సత్యజిత్ ట్విట్ చేశారు.