కేంద్రంతోనే.. ఏపీ కూడా !

లాక్‌డౌన్ పొడగింపు విషయంలో ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని ఫాలో అవుతోంది. కేంద్రం ఏ డేటు చెబితే అదే డేటుకు.. అదీ కూడా కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాతేనిర్ణయం తీసుకుంటుంటోంది. కేంద్రం ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ పొడగిస్తూ.. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ని కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

కొన్ని రాష్ట్రాలు మాత్రం కేంద్రం కంటే ముందే లాక్‌డౌన్ పొడగింపుపై నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ముందే ఈ నెల 28 వరకు లాక్‌డౌన్ ఉంటుందని ప్రకటించింది. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం కంటే ముందే లాక్‌డౌన్ పై నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్  పొడగింపు విషయంలో ఎలాంటి హడావుడి లేకుండా కేంద్రం తీసుకొనే నిర్ణయాలనే ఫాలో అవుతోంది.