తెలంగాణలో జూన్ రెండో వారంలో  పదో తరగతి పరీక్షలు

కరోనా కారణంగా తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మధ్యలోనే ఆగిపోయాయ్. అయితే పదో తరగతి పరీక్షలని నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈరోజు పదోతరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం జూన్ మొదటి వారం తర్వత పరీక్షలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. 

కరోనా పరిస్థితులపై జూన్ 3న సమీక్షించాలని న్యాయస్థానం సూచించింది. పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని, పరిస్థితి తీవ్రంగా ఉంటే పరీక్షలు నిర్వహించవద్దని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో జూన్ రెండో వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.