పూరి-బాలయ్యల బంధం అలాంటిది : ఛార్మీ

పూరీ జగన్నాథ్-బాలకృష్ణ కాంబోలో ఇప్పటికే ‘పైసా వసూల్’ సినిమా వచ్చింది. ఈ సినిమాని భవ్య క్రియేషన్స్  నిర్మించింది. పైసా వసూల్ మాస్ ప్రేక్షకుల్ని బాగా అలరించింది. ఈ సినిమా సమయంలో పూరి-బాలయ్య బాగా దగ్గరయ్యారు. ఎంతలా అంటే.. ? స్టార్ హీరోలతో పని చేసిన పూరికి బాలయ్య ఫేవరేట్ హీరో అయ్యారు. ఆయనతో ఎప్పుడంటే అప్పుడు మరో సినిమా చేస్తానని పలు ఇంటర్వ్యూలో చెప్పాడు పూరి. తాజాగా బాలయ్యతో పూరి సినిమాపై ఛార్మీ స్పందించారు.

“బాలయ్యతో సినిమా తీయడానికి పూరీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. వారిద్దరి మధ్య అంత మంచి బంధం ఉంది. బాలయ్య సినిమా అంటే మంచి కథ కావాలి. సరైన స్క్రిప్టు కుదిరినప్పుడు ఇద్దరూ కలిసి సినిమా తీస్తారు” అని చెప్పారు. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్న ఛార్మి నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మించారు.  పైసా వసూల్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం పూరి-ఛార్మీ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి ఫైటర్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.