కశ్మీర్ ఎప్పటికీ భారత్’దే : తాలిబన్

కశీర్ విషయంలో భారత్ కి తాలిబన్ సపోర్ట్ చేసింది. కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యేంత వరకు భారత్ కు తమ గ్రూప్ నకు మధ్య సత్సంబంధాలు కొనసాగే ప్రసక్తే లేదని తాలిబన్ ప్రకటన విడుదల చేసినట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ… తాలిబన్ రాజకీయ విభాగంగా చెప్పుకొనే ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్థాన్ మీడియా ప్రతినిధి సుహైల్ షాహీన్  స్పందించారు.

కశ్మీర్ ఎప్పటికీ భారత్ దేనని తేల్చి చెప్పారు. తాము ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాడు. ‘ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని.. తాము ఇప్పటి వరకు అలాంటి ప్రకటనలేమీ చేయలేదని స్పష్టం చేశారు. పొరుగు దేశాల అంతర్గత అంశాల్లో తలదూర్చొద్దన్నదే తమ విధానం’ అని తేల్చి చెప్పారు.