నాగబాబుకు రాములమ్మ కౌంటర్

‘మహాత్మగాంధీని చంపిన గాడ్సే గొప్ప దేశభక్తుడు’ అని తెలిపే ఓ వీడియోని మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. నాగబాబు పోస్ట్ పై హస్తం నేతలు ఫైర్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, సినీ నటి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి నాగాబాబుపై కౌంటర్స్ వేశారు.

చిరంజీవి గాంధీ గిరి మీద సినిమా తీస్తే.. నాగాబు ఆరెస్సెస్ ట్రాప్‌లో పడ్డాడని వీహెచ్ ఆరోపించారు వీహెచ్. నాగబాబు ఎందుకు అలా మాట్లాడాడో తెలియదన్న ఆయన తమ్ముడు పవన్ కమ్యూనిస్టు గురించి సినిమా చేశాడని అన్నారు. ఓకే కుటుంబములో ఎన్ని ట్విస్టులో అని వీహెచ్ పేర్కొన్నారు.

విజయశాంతి కూడా నాగబాబుపై ఫైర్ అయ్యారు. కుల, మతాలు వేరైనా దైవం ఒక్కటే. ఎన్ని తరాలైనా జాతిపితా ఒక్కడే. 130 కోట్ల మంది భారతీయులకు మహాత్ముడు ఒక్కడేనని ఆమె ట్వీట్ చేశారు. ‘ఈశ్వర్, అల్లా… తేరానామ్… సబ్ కో సన్మతి దే భగవాన్.. ”నాకు కూడా”…”అని” గాడ్సే, ఇప్పుడు బ్రతికుంటే… ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్ధించేవాడు, మహాత్మా మన్నించండి’ రాములమ్మ ట్విట్ చేశారు.